పారిశ్రామిక ప్రమాదాలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు
ఏడాదికి రెండు సార్లు కాంప్లియన్స్ నివేదికలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం,థర్డ్పార్టీ తనిఖీలు కూడా
క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్సెక్రటరీ నీరబ్ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా ఇతర అధికారులు హాజరు.రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించిన అధికారులు.స్పెషల్డ్రైవ్ ముమ్మరంగా సాగుతోందని తెలిపిన అధికారులు.వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తిచేస్తామన్న అధికారులు.–పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ.–కొత్తగా ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని ప్రతిపాదించిన అధికారులు.
పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతం ఉన్నరెగ్యులేటరీ వ్యవస్థలన్నీకూడా ఈసేఫ్టీ పాలసీపరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం.అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులను వీటన్నింటినీ సూచిస్తూ ఇండస్ట్రియల్ అట్లాస్ రూపొందించాలని నిర్ణయం.ఎలాంటి పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్నదానిపై ఈ అట్లాసులో వివరాలు.పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నదానిపై ఈ అట్లాస్ ద్వారా వివరాలు.పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలన్న సీఎం.
వీటిపైఎలాంటి చర్యలు తీసుకున్నామన్నఅంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై పెట్టాలి, థర్డ్పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి. విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈసమస్య వచ్చింది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా విధానంలో పొందుపరచండి.