చైనా, పాకిస్తాన్, శత్రు దేశాలతో, సరిహద్దు వివాదం తో, శత్రు దేశాలను మన జోలికొస్తే మరింత బలగాన్ని పెంచుకునే దానికి. బలగాన్ని పెంచుకుని భారతదేశం పవర్ చూపించడానికి. దేశ వాయుసేన తన బలాన్ని మరింత పెంచుకోవడంలో బిజీ గా మారి తలమునకలై ఉంది. భారతదేశం మిలటరీకి చెందిన ఇజ్రాయెల్ డ్రోన్ హెరాన్ యూఏవీని, మరింత శక్తివంతం చేయడానికి, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు పోతున్నారు.శత్రు లక్ష్యాలు, సాయుధ రెజిమెంట్ల కోసం లేజర్-గైడెడ్ బాంబులు, ప్రెజర్-గైడెడ్ మందుగుండు సామగ్రి, యాంటీ ట్యాంక్ క్షిపణులతో, హెరాన్ను సిద్ధం చేయడానికి సిద్ధపడుతుంది సైన్యం.
దీర్ఘకాలంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు సైన్యం ముందుకు తీసుకొస్తుంది. దీని కోసం భారతదేశ ప్రభుత్వం 3500 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. సైన్యాల నుంచి 90 హెరోన్ డ్రోన్లను లేజర్-గైడెడ్ బాంబులు, క్షిపణులతో క్రియేట్ చేస్తుంది. మన రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ తో పాటు ఉన్నత స్థాయి రక్షణ మంత్రిత్వ అధికారులు మంత్రిత్వశాఖ అధికారులు ఈ విషయాన్ని ముందుకు తీసుకోబోతున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఈ డోన్ లో స్పెషాలిటీ చైనా సరిహద్దులు, చైనా యొక్క సైన్యం చేపట్టే కార్యక్రమాలను, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారిని వెనక్కి వెళ్లేలా చేయగలదని మన సైనిక వర్గాలు వెల్లడించాయి. మూడు సైన్యాలు గత కొన్నేళ్లుగా హెరోన్ డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. ఇది ఒకేసారి రెండు రోజుల పాటు ఆకాశంలో ఎగురుతుంది. అలాగే పది కిలోమీటర్ల ఎత్తు నుంచి శత్రువు ప్రతి కదలికను పర్యవేక్షించి సామర్థ్యం దీని సొంతం. ఇది తప్పకుండా భారత సైన్యానికి బలం, బలగం.