ఏపీలో టెస్టులు , ట్రేసింగ్ భేష్ బ్రిటిష్ హైకమిషనర్ ప్రశంస.సీఎం శ్రీ వైయస్.జగన్తో వీడియో కాన్ఫరెన్స్అంబులెన్స్ల నిర్వహణలో ఇంగ్లండ్ ఎన్హెచ్ఎస్ భాగస్వామ్యం. బ్రిటిష్ దౌత్యాధికారులతో సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న భారత్లో బ్రిటిష్ తాత్కాలిక హై కమిషనర్ జాన్ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కోవిడ్ నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై చర్చ. వీడియో కాన్ఫరెన్స్లో బ్రిటిష్ తాత్కాలిక హైకమిషనర్, జాన్ థాంప్సన్ ఏమన్నారంటే కోవిడ్నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన బ్రిటిష్ హైకమిషనర్. కోవిడ్ లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని దేశాలు కలిసిపనిచేయాల్సిన అవసరం ఉంది.వ్యాక్సిన్ యూకేలో తయారవుతోంది. భారత్లో ఈ వ్యాక్సిన్ను ఉత్పత్తిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి..
ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.. భారీగా టెస్టులు చేయడంలో, పాజిటివ్ కేసులను గుర్తించండంలో ఆంధ్రప్రదేశ్ విశేషంగా పనిచేస్తోంది.అలాగే కోవిడ్ వల్ల మరణాలు రేటు పూర్తిగా అదుపులో ఉండడం ప్రశంసనీయం. టెలీమెడిసిన్ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారు. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలను తీసుకుంటోంది. ఏపీ మెడ్ టెక్జోన్తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కోవిడ్ నివారణకోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈవిషయంలో స్టార్టప్ కంపెనీలను యూకే ప్రోత్సహిస్తుంది. కరోనా విపత్తును ఎదుర్కోనే ప్రక్రియలో కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇంగ్లండ్కు చెందిన నేషనల్ హెల్త్మిషన్ భాగస్వామం 108, 104 లాంటి అంబులెన్స్ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలకు దారితీస్తుంది.కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్ రావాల్సిందిగా సీఎం శ్రీ వైయస్.జగన్ను బ్రిటిష్ హైకమిషనర్ ఆహ్వానించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం శ్రీ వైయస్.జగన్ రాష్ట్రంలో కోవిడ్ టెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నాం.సగటున రోజుకు 62వేల వరకూ పరీక్షలు చేస్తున్నాం. దీనివల్ల కేసులు బాగా నమోదవుతున్నాయి. కోవిడ్సోకిన వారిని వేగంగా గుర్తించి.. వారిని ఐసోలేట్చేయడానికి, వైద్యం అదించండానికి తద్వారా మరణాలు రేటు తగించడానికి ప్రయత్నిస్తున్నాం మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతం. మేం అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అన్ని రకాల పెద్ద ఆస్పత్రులు, వైద్య సేవలు అక్కడే అభివృద్ది చెందాయి.16 కొత్త మెడికల్ కాలేజీలను కాలేజీలు, ఆస్పత్రులు తీసుకువస్తున్నాం. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్ నిర్మిస్తున్నాం.. బ్రిటన్ సహకారం మారాష్ట్రానికి చాలా అవసరం, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం. ఆస్పత్రులకు ఆలస్యంగా వస్తున్నందువల్లే కోవిడ్ మరణాలు వస్తున్నాయి. ఎంత త్వరగా వస్తే.. అంతగామరణాలు తగ్గించవచ్చు.10వేలకుపైగా రెమిడెసివర్ ఇంజక్షన్లు వాడి చాలా మందికి మెరుగైన వైద్యాన్ని అందించాం.త్వరగా ఆస్పత్రికి రావడం అన్నది చాలా ముఖ్యం..